Homeతెలంగాణఅర్రాస్​ పాడినట్టు ఖర్గే డిక్లరేషన్​ ?

అర్రాస్​ పాడినట్టు ఖర్గే డిక్లరేషన్​ ?

– దళితుల కోసం కాంగ్రెస్​ చేసిందేంటి?
– ఎన్నికల టైమ్​లో డిక్లరేషన్లు అంటూ డ్రామాలు
– కాంగ్రెస్​, బీజేపీకి అభ్యర్థులు కరువు
– బీఆర్ఎస్​ ఎమ్మెల్సీ కవిత

ఇదేనిజం, కామారెడ్డి: కాంగ్రెస్​ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దళితుల కోసం ఏం చేసిందని బీఆర్ఎస్​ ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు వస్తున్నాయి గనక డ్రామాలు చేస్తున్నారని వాపోయారు. కాంగ్రెస్ పార్టీ దళితులను మరోసారి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నదని విమర్శించారు. దేశాన్ని, రాష్ట్రాన్ని ఎక్కువ రోజులు పాలించిన కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిక్లరేషన్ పెట్టి దళితులకు ఏమో చేస్తామనడం భావ దారిద్ర్యం తప్పా మరొకటి కాదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. సోమవారం ఆమె కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్​ ఆఫీసులో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలంగాణకు వచ్చి ఎస్సీ డిక్లరేషన్ చేయడం అర్రస్ పాట పాడినట్టు ఉందని ఎద్దేవా చేశారు. ఎస్సీలను ఎన్నో ఏండ్లు పేదరికంలో ఉంచిన చరిత్ర కాంగ్రెస్‌ది అని మండిపడ్డారు. ఆ పార్టీ రాజకీయ లబ్ధికోసం చేసే ఎత్తుగడలు తప్పా దళితుల కోసం చేసేదేమీ లేదన్నారు. ఇన్ని రోజులు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ దళితులకు ఏం చేసిందని ప్రశ్నించారు. రైతుల కోసం బీజేపీ మీటింగ్ పెట్టడం, ఆ సభకు అమిత్ షా రావడం, హంతకుడే రైతులకు సంతాపం తెలిపినట్టుందని మండిపడ్డారు. మోటర్లకు మీటర్లు పెట్టాలని బీజేపీ ప్రభుత్వం చూస్తున్నదని ఆరోపించారు. దళితుల కోసం పనిచేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. అదే కర్ణాటక రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితిని కుంటి సాకుగా చెప్తూ ఉచిత పథకాలను ఎత్తి వేసిందని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభించిన రైతు బంధును కాపీ కొట్టి కేంద్రంలోని మోదీ ప్రభుత్వం.. 13 కోట్ల మందికి రైతు బంధు ప్రారంభించి 2.5 కోట్ల మందికే ఇస్తున్నారు. రాష్ట్రంలో మాత్రం అందరికీ ఇస్తున్నామని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్‌ అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటున్నారని చెప్పారు. కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలకు అభ్యర్థులేరన్నారు.

Recent

- Advertisment -spot_img