ఈ టీవీ ఖరీదు రూ. కోటి
- భారత మార్కెట్లోకి శాంసంగ్ లగ్జరీ టీవీ..
samsung new tv: ఇదేనిజం, డెస్క్: ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థ శాంసంగ్ తాజాగా లగ్జరీ టీవీని భారత మార్కెట్ లోకి తీసుకొచ్చింది. దీని ఖరీదు రూ. కోటి వరకు ఉంటుందని సమాచారం. ఏంఐఏఐ ప్రాసెసర్ తో, 110 అంగుళాల 4 కే డిస్ ప్లేతో దీని తయారు చేశారు. సఫైర్ గ్లాస్తో ఈ స్క్రీన్ను తయారు చేశారు. డాల్బీ అట్మాస్, మొబైల్ మిర్రరింగ్, వైఫై కనెక్టివిటీ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయని శాంసంగ్ వెల్లడించింది. ప్రస్తుతం శాంసంగ్ స్టోర్లతో పాటు ఇతర స్టోర్లలోనూ ఈ టీవీ అందుబాటులో ఉంది. మెరుగైన ఆడియో, నాణ్యమైన వీడియో ఈ టీవీ ప్రత్యేకతలను కంపెనీ వెల్లడించింది.