దుబ్బాక ఎమ్మెల్యే సోలీపేట రామలింగా రెడ్డిపై మంత్రి హరీష్ రావు తనకున్న ఆత్మీయతను చాటుకున్నారు. విద్యార్థి దశ నుండే ఉద్యామాల చిరునామాగా, ఒక మంచి జర్నలిస్టుగా గారిబోళ్ల నాయకుడిగా పేరు తెచ్చుకున్న నాయకుడు సోలిపేట రామలింగారెడ్డి. రామలింగారెడ్డికి, మంత్రి హరీష్ రావుకు మద్య ఎంతో కాలంగా మంచి స్నేహం ఉంది. మంత్రి హరీష్ రావు రామలింగా రెడ్డిని తన ఇంట్లో మనిషిగానే చూస్తారు. కానీ రామలింగారెడ్డి అకాల మరణం హరీష్ రావుకు మంచి స్నేహితున్ని దూరం చేసింది. దీంతో హరీష్ రావుతో పాటు దుబ్బాక ప్రజలూ తీరని లోటుగా భావిస్తున్నారు. అయితే ఈ రోజు జరిగిన రామలింగారెడ్డి అంతిమ సంస్కరణలలో మంత్రి హరీష్ రావు పాల్గొనడమే కాకుండా అంతిమ శవ యాత్రలో పాడె మోసి తన ఆప్యాయతను చాటుకున్నారు. ఈ అంతిమ యాత్రలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, పార్టీ శ్రేణులు, అభిమానులు పాల్గొన్నారు.