హైదరాబాద్ః మహిళలపై అఘాయిత్యాలు జరిగిన ప్రతిసారీ వాళ్ల వస్త్రధారణపై విమర్శలు వినిపిస్తూ ఉంటాయి. పొట్టి పొట్టి బట్టలు వేసుకోవడం వల్లే రేప్లు జరుగుతున్నాయంటూ వాదనలు వినిపిస్తున్నారు చాలామంది.
అయితే ఇలాంటి అనుభవాన్ని తెలియజేస్తూ కన్నీరు మున్నీరైంది ప్రముఖ హీరోయిన్ ప్రియమణి. ఈటీవీలో ప్రసారం అవుతున్న ఢీ ఛాంపియన్స్కి జడ్జీగా వ్యవహరిస్తున్న ప్రియమణి ఎమోషనల్ అయ్యింది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తోన్న ‘వకీల్ సాబ్’ సినిమాలోని ఈ ‘మగువా మగువా’ పాటను ఢీ ఛాంపియన్స్లో కాంటెస్టెంట్లు పెర్ఫామ్ చేశారు.
దీంతో ఢీ ఛాంపియన్స్లో ఉన్న మహిళలంతా భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగా మహిళల్ని ఏవిధంగా కించపరుస్తున్నారో తెలియజేసింది ప్రియమణి. ఆమె మాట్లాడుతూ కన్నీటి పర్యంతం అయ్యింది.
ఆడవాళ్లు ఎందుకు బయటకు వచ్చి పనిచేయాలి? ఇంట్లోనే ఉండొచ్చు కదా.. ఆడవాళ్లు పొట్టి పొట్టి బట్టలు ఎందుకు వేసుకోవాలి?? అని సోషల్ మీడియాలో ఒకతను పురుషుల తరపున క్వచ్ఛన్స్ వేస్తున్నాడు.
ఇంట్లోనే ఉంటే రేప్ జరగదు కదా.. అని అన్నాడు. ఆ ఒక్కడే కాదు.. అందరూ అదే మాట అంటున్నారని అంటూ ఏడ్చేసింది ప్రియమణి. ఇక ప్రియమణి మాటలకు స్టేజ్పై ఉన్న యాంకర్ రష్మితో పాటు వర్షిణి కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు.
ప్రస్తుతం ఈ ప్రోమో యూట్యూబ్లో టాప్ ట్రెండింగ్లో రెండో స్థానంలో ఉంది.