హైదరాబాద్ః తెలంగాణలో కరోనా వైరస్ టెస్టుల ధరలు భారీగా తగ్గిపోయాయి. తెలంగాణ రాష్ట్రంలోని ప్రైవేట్ ల్యాబ్స్లో నిర్వహించే RTPCR టెస్టుల ధర రూ.2200 నుంచి రూ.850కి తగ్గిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ఇంటి వద్దకే వచ్చి సాంపిల్స్ కలెక్ట్ చేస్తే RTPCR టెస్టు ధర రూ.2800 నుంచి రూ.1200కు తగ్గించినట్లు డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డాక్టర్ జి.శ్రీనివాసరావు తెలిపారు.
రాష్ట్రంలో 18 RTPCR టెస్టులు నిర్వహించే ప్రభుత్వ ల్యాబ్స్, 50 ప్రైవేట్ ల్యాబ్స్ ఉన్నాయని ఆయన తెలిపారు.
ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించే సెంటర్లలో కరోనా టెస్టులు ఉచితంగానే చేస్తారని ఆయన పేర్కొన్నారు.
ప్రస్తుతం తెలంగాణలోని 1076 ప్రైమరీ హెల్త్ సెంటర్లు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులను ప్రభుత్వం ఉచితంగా నిర్వహిస్తోందని గుర్తుచేశారు.