– ఆలయం, మసీదు, చర్చి ప్రారంచించిన గవర్నర్, సీఎం
– పూర్ణాహుతిలో పాల్గొన్న గవర్నర్, ముఖ్యమంత్రి
ఇదేనిజం, హైదరాబాద్: సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళిసై సచివాలయంలో ఆలయం, మసీదు, చర్చి ప్రారంభించారు. దీంతో సెక్రటేరియల్ లో సందడి వాతావరణం నెలకొన్నది. ముఖ్యమంత్రి ఆహ్వానం మేరకు గవర్నర్ తమిళిసై ఇవాళ సచివాలయంలో ఆలయాల ప్రారంభోత్సవానికి గవర్నర్ వెళ్లారు. సచివాలయ ప్రాంగణంలోని నల్లపోచమ్మ ఆలయ ప్రారంభ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గవర్నర్ తమిళిసై, ముఖ్యమంత్రి కేసీఆర్ నల్లపోచమ్మ ఆలయంలో పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. కొంతకాలంగా రాజ్ భవన్, ప్రగతి భవన్ మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. కాగా ఇటీవల గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్ మధ్య సయోధ్య కుదిరినట్టు కనిపిస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన పలు బిల్లులను గవర్నర్ పెండింగ్ లో ఉంచారు. దీంతో ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. ఇటీవల కేబినెట్ ఆమోదించిన ఆర్టీసీ విలీనం బిల్లును ఆమోదించేందుకు కూడా గవర్నర్ ఇబ్బంది పెట్టిన విషయం తెలిసిందే. కాగా ఎట్టకేలకు పట్నం మహేందర్ రెడ్డి ప్రమాణస్వీకారోత్సవ వేళ.. సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళిసై ఒక్కటయ్యారు. దాదాపు 20 నిమిషాల పాటు వీరి భేటీ సాగింది.