HomeతెలంగాణTELANGANA:తెలంగాణ ఎక్స్​ప్రెస్​కుత్రుటిలో తప్పిన ప్రమాదం

TELANGANA:తెలంగాణ ఎక్స్​ప్రెస్​కుత్రుటిలో తప్పిన ప్రమాదం

త్రుటిలో తప్పిన ప్రమాదం
– ఎస్​ –2 బోగీలో మంటలు..
– వెంటనే నిలిపివేసిన రైల్వే సిబ్బంది

ఇదేనిజం, హైదరాబాద్​: తెలంగాణ ఎక్స్​ ప్రెస్​ కు ఇవాళ త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. శనివారం తెల్లవారుజామున ఒక్కసారిగా ఎస్​ –2 బోగీలో మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళన చెందారు. రైల్వే సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తీసుకురావడంతో పెను ప్రమాదం తప్పింది. నాగ్‌పుర్‌ సమీపంలో నిలిపివేయడంతో ప్రయాణికులు బోగి నుంచి కిందకు దిగారు. ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదని, ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారని అధికారులు తెలిపారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. కర్ణాటక రాజధాని బెంగళూరులోనూ ఓ రైలుకు ప్రమాదం తప్పింది. కేఎస్‌ఆర్‌ రైల్వే స్టేషన్‌లో ఆగి ఉన్న ఉద్యాన్‌ ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. క్షణాల్లో మంటలు వ్యాపించి దట్టమైన పొగ అలుముకుంది. అయితే ప్రయాణికులు రైలు నుంచి దిగిన రెండు గంటల తర్వాత ఈ ప్రమాదం చోటుచేసుకోవడంతో పెను ప్రమాదం తప్పింది.

Recent

- Advertisment -spot_img