రంగారెడ్డి జిల్లాలో ఘోరా రోడ్డు ప్రమాదం జరిగింది. చేవెళ్ల మండలం ఆలూరు స్టేజ్ దగ్గర అదుపు తప్పిన లారీ ఫుడ్ పాత్పైకి దూసుకెళ్లింది. దీంతో ఫుట్పాత్పై కూరగాయలు అమ్మేవారిపై లారీ దూసుకెళ్లింది.ఈ ప్రమాదంలో దాదాపు పది మందికి పైగా మృతి చెందారు. దీంతో పాటు ఏడుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. అయితే ఈ ఘటనలో 20 మందికి పైగా గాయపడినట్లు తెలుస్తోంది.ప్రమాదంపై స్థానికులు సమాచారం అందించడంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని..క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.