సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘పుష్ప 2’ మూవీ రాబోతుంది. ఈ సినిమాలో రష్మిక మందన హీరోయినిగా నటించింది. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. తొలి భాగం భారీ విజయం సాధించడంతో రెండో పార్ట్గా వస్తున్న ‘పుష్ప 2’ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన ‘పుష్ప 2′ సినిమాకి సంబంధించిన పాటలు, ట్రైలర్ కి అభిమానుల నుంచి మంచి ఆదరణ లభించింది.’పుష్ప 2’ డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. అయితే మరికొద్ది వారాల్లో విడుదల కానున్న ఈ సినిమా ఇప్పుడు ప్రమోషన్స్లో జోరు అందుకుంది. ఇదంతా పక్కన పెడితే ‘పుష్ప 2’ సినిమా విడుదలకు ముందే 1000 కోట్లు వసూలు చేసింది అని టాక్ వైరల్ అవుతోంది. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ కేవలం రూ. 660 కోట్లు, డిజిటల్ మరియు శాటిలైట్ రైట్స్ రూ. 250 కోట్ల వరకు ధర పలికిందని అంటున్నారు. దీనిని పరిశీలిస్తే ‘పుష్ప 2’ చిత్రం విడుదలకు ముందే 1000 కోట్లు వసూలు చేసేందుకు సిద్ధమైంది.