పపువా న్యూగినియా ప్రమాదంలో ఇప్పటివరకూ 2వేల మంది చనిపోయినట్టు అక్కడి ప్రభుత్వం పేర్కొంది. ఇతర దేశాల సహాయం కావాలని ఐక్యరాజ్యసమితిని కోరింది. ఆస్ట్రేలియా స్పందించింది. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఎయిర్లిఫ్ట్ ఆపరేషన్ చేపడతామని పేర్కొంది. వైద్య సామాగ్రిని సమకూరుస్తామని చెప్పింది. కొండచరియలు ఇంకా జారుతూ ఉండటం వల్ల రెస్క్యూ టీంకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి.