రేపు బీసీ రణభేరి మహాసభ నిర్వహించనున్నట్లు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ .ఆర్ .కృష్ణయ్య వెల్లడించారు. చట్టసభల్లో బీసీలకు 50శాతం రిజర్వేషన్ అమలుచేయాలి అని ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేసారు. పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టాలని తెలిపారు. బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని ఆయన తెలిపారు. రణభేరి సభకు అఖిలపక్ష నేతలు వస్తున్నారు అని ఆర్.కృష్ణయ్య తెలిపారు.