Homeక్రైంLove murder:పెళ్లిచేసుకోమంటే హత్య చేసిన పూజారి

Love murder:పెళ్లిచేసుకోమంటే హత్య చేసిన పూజారి

Love murder: నగరంలోని సరూర్‌నగర్‌ ప్రాంతానికి చెందిన పూజారి సాయికృష్ణకు అప్సర అనే మహిళతో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ ఒకే కాలనీలో ఉంటున్నారు. గుడికి వెళ్తూ వస్తుండగా ఈ ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడగా.. అది కాస్త వివాహేతర సంబంధం దాకా వెళ్లింది. సాయికృష్ణకు పెళ్లయ్యింది.. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే తనను పెళ్లి చేసుకోవాలని సాయిపై అప్సర ఒత్తిడి తెస్తూ వచ్చింది. దీంతో కోప్రోదిక్తుడైన సాయి.. బయటికెళ్దామని చెప్పి ఇద్దరూ కారులో శంషాబాద్‌లోని సుల్తాన్‌పల్లికి వెళ్లారు. కోయంబత్తూరు వెళ్తున్నట్లు చెప్పి అప్సర.. సాయికృష్ణ దగ్గరికెళ్లింది. అక్కడికి వెళ్లాక కూడా పెళ్లి ప్రస్తావన రావడంతో ఆగ్రహంతో రగిలిపోయిన సాయికృష్ణ.. అప్సర తలపై బండరాయితో హత్యచేసి మళ్లీ అదే కారులో తీసుకొచ్చి స్థానికంగా ఉన్న ప్రభుత్వ డిగ్రీ కాలేజీ వద్ద మ్యాన్‌హోల్‌లో పడేశాడు. అనంతరం తనకేమీ తెలియదన్నట్లుగా తన సమీప బంధువు అప్సర కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు సాయి సెల్‌ఫోన్ సిగ్నల్స్, సీసీ కెమెరాల దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేయగా.. సాయికృష్ణే నిందితుడని పోలీసులు తేల్చారు. నిందితుడిని అదుపులోనికి తీసుకున్న పోలీసులు మరోవైపు.. మ్యాన్‌హోల్‌‌లో ఉన్న మృతదేహాన్ని గుర్తించి వెలికితీశారు.

అయితే ఈ ఘటనపై ఇప్పుడిప్పుడే విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి.గర్భం దాల్చింది అందుకు నేనే కారణమని పెళ్ళిచేసుకోవాలని ఒత్తిడి చేసింది. కానీ ఆమె వేరేవాళ్లతో కూడా సన్నిహితంగా ఉండేది. ఇవన్నీ భరించలేకే హత్య చేశాను అని పోలీసుల విచారణలో సాయికృష్ణ వెల్లడించాడు. ఆ తర్వాత ఘటనాస్థలానికి పోలీసులు తీసుకెళ్లి మృతదేహాన్ని గుర్తించారు.

Recent

- Advertisment -spot_img