Homeఫ్లాష్ ఫ్లాష్Bandi sanjay:అప్పుల ఊబిలో తెలంగాణ -బండి సంజయ్

Bandi sanjay:అప్పుల ఊబిలో తెలంగాణ -బండి సంజయ్

Bandi sanjay:రిటైర్డ్ అయిన 500 మంది అధికారులను అడ్డుపెట్టుకుని ఏటా వెయ్యి కోట్లు సంపాదించడమే లక్ష్యంగా కేసీఆర్ పనిచేస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు . తెలంగాణ అప్పుల ఊబిలో కూరుకుపోయిందని విమర్శించారురిటైర్డ్ డీజీపీ ఎస్.కె.జయచంద్ర, ఆయన కుమార్తె పాయల్ నేహా బీజేపీ లో చేరారు . కాషాయ కండువా కప్పి బండి సంజయ్ కుమార్ పార్టీలోకి ఆహ్వానించారు బీజేపీ సిద్దాంతాలు, ప్రధాని మోదీ విధానాలు నచ్చి రిటైర్డ్ డీజీపి ఎస్.కె.జయచంద్ర, వారి కూతురు పాయల్ నేహాలు బీజేపీలో చేరడాన్ని స్వాగతిస్తున్నానని బండి సంజయ్ అన్నారు .

నిస్వార్థంగా పనిచేసే రిటైర్డ్ అధికారులు బీజేపీలో చేరడం సంతోషంగా ఉందన్నారు. భవిష్యత్తులో కూడా చాలా మంది నేతలు బీజేపీలో చేరబోతున్నారని వెల్లడించారు తెలంగాణ అభివ్రుద్దిని కాంక్షించే మేధావి వర్గం బీజేపీలో చేరాలని కోరారు . సీఎం కార్యాలయంలో కొంతమంది తీరు కేసీఆర్ కు డబ్బు సంపాదించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారని ఆరోపించారు . ఈ చివరి ఘడియల్లోనైనా ఆ అధికారులు ఆలోచనను మార్చుకుని తెలంగాణ భవిష్యత్ కోసం పనిచేయాలని కోరారు

Recent

- Advertisment -spot_img