ఇదేనిజం, హైదరాబాద్: తెలంగాణ పీజీటీ ( పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ ) పరీక్ష ఆలస్యమైంది. నిజానికి ఇవాళ ఉదయం 8.30 గంటలకు పరీక్ష నిర్వహించాల్సి ఉంది. అభ్యర్థులు కూడా పరీక్షా కేంద్రానికి చేరుకున్నారు. అయితే సాంకేతిక సమస్య తలెత్తడంతో అభ్యర్థులను పరీక్షా కేంద్రాలకు రానివ్వలేదు. దీంతో ఎగ్జామ్ 10.16 నిమిషాలకు నిర్వహించారు. కానీ సర్వర్లో సాంకేతిక సమస్య కారణంగా పరీక్ష ఆలస్యమైనట్లు పరీక్ష కేంద్రాల నిర్వహకులు తెలిపారు. దీంతో అభ్యర్థులను చాలాసేపటి వరకు లోపలికి అనుమతించలేదు. హైదరాబాద్ హయత్ నగగర్ లోని ఐఓఎన్ డిజిటల్ న్లో పరీక్ష ఆలస్యం కావడంతో అభ్యర్థులు ఆందోళలకు దిగారు.