– కేసీఆర్ నమ్మించి మోసం చేశారు
– ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు
ఇదేనిజం, హైదరాబాద్: సీపీఐకి తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 30 సెగ్మెంట్లలో బలముందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో తమ సత్తా చూపిస్తామన్నారు. గురువారం ఆయన హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ తమను అవమానించారని ఆరోపించారు. ఒక్కసీటు ఇస్తామని ఆఫర్ ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. మునుగోడు ఉప ఎన్నికల సమయంలో బీజేపీని ఓడించాలన్న లక్ష్యంతోనే తాము బీఆర్ఎస్ కు సపోర్ట్ చేశామని చెప్పారు. సీపీఐకి రాష్ట్రవ్యాప్తంగా అనేక నియోజకవర్గాల్లో బలమైన ఓటుబ్యాంకు ఉందని చెప్పారు.