HomeతెలంగాణThe staff attacked the customer: ఎక్స్ ట్రా రైతా అడిగిన కస్టమర్ పై సిబ్బంది...

The staff attacked the customer: ఎక్స్ ట్రా రైతా అడిగిన కస్టమర్ పై సిబ్బంది దాడి

– తీవ్రంగా గాయపడి కుప్పకూలిన కస్టమర్
– పంజాగుట్టలోని మెరిడియన్ హోటల్ లో దారుణం

The staff attacked the customer: ఇదే నిజం, హైదరాబాద్: బిర్యానీ తినేందుకు ఓ హోటల్ కు వెళ్లిన కస్టమర్.. ఎక్స్ ట్రా కప్ రైతా(పెరుగు) అడిగినందుకు సిబ్బంది అతడిపై దాడి చేశారు. ఈ ఘటనలో కస్టమర్ చనిపోయాడు. పంజాగుట్టలోని మెరిడియన్ హోటల్ లో ఈ దారుణం జరిగింది. చాంద్రాయణగుట్టకు చెందిన లియాకత్ ఆదివారం అర్ధరాత్రి పంజాగుట్టలోని మెరిడియన్ హోటల్​కు వెళ్లాడు. అక్కడ బిర్యానీ ఆర్డర్ చేసి తింటున్న లియాకత్.. మధ్యలో ఎక్స్ ట్రా రైతా తీసుకురావాలని సిబ్బందిని అడిగాడు. అలా ఇవ్వడం కుదరదని సిబ్బంది చెప్పడంతో వాగ్వాదం జరిగింది. దీంతో హోటల్ సిబ్బంది లియాకత్ పై దాడి చేశారు.
గాయపడ్డ లియాకత్.. సిబ్బందిపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసేందుకు వెళ్తూ ఒక్కసారిగా కుప్పకూలాడు. అతడిని హాస్పిటల్​కు తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. కేసు ఫైల్ చేసి పోలీసులు హోటల్ సిబ్బందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Recent

- Advertisment -spot_img