Homeతెలంగాణcompromise between Rajaiah and Kadiam: సయోధ్య కుదిరింది

compromise between Rajaiah and Kadiam: సయోధ్య కుదిరింది

– స్టేషన్​ ఘన్​పూర్​ బీఆర్ఎస్​లో పంచాయితీ క్లోజ్​
– ఒక్కటైన రాజయ్య, కడియం
– చక్రం తిప్పిన మంత్రి కేటీఆర్​
– ఫలించిన పల్లా చొరువ

compromise between Rajaiah and Kadiam: ఇదే నిజం, వరంగల్ ప్రతినిధి: స్టేషన్​ ఘన్​పూర్​ బీఆర్ఎస్​లో అసమ్మతి చల్లారింది. ఉప్పు, నిప్పులా ఉన్న నేతలు ఒక్కటయ్యారు. మంత్రి కేటీఆర్ చొరవతో ఈ నియోజకవర్గంలో ఉన్న కీచులాటలు తగ్గిపోయాయి. స్టేషన్​ ఘన్​ పూర్​ సిట్టింగ్​ ఎమ్మల్యే తాటికొండ రాజయ్య.. బీఆర్ఎస్​ అభ్యర్థి కడియం శ్రీహరి మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటున్న విషయం తెలిసిందే. రాజయ్యను పక్కకు పెట్టి.. కడియం శ్రీహరికి టికెట్​ ఇవ్వడంతో రాజయ్య తీవ్రంగా నొచ్చుకున్నారు. నియోజకవర్గంలో అస్సలు మద్దతు ఇవ్వడం లేదు. బీఆర్ఎస్​ హైకమాండ్​ తరఫున పల్లా రాజేశ్వర్​ రెడ్డి రంగంలోకి దిగి నచ్చజెప్పినా ఆయన వినలేదు. తాజాగా శుక్రవారం మంత్రి కేటీఆర్​ .. ఈ ఇద్దరు నేతలను పిలిపించి సముదాయించారు. తాటికొండ రాజయ్యకు పదవి ఇస్తామని హామీ ఇచ్చినట్టు తెలిసింది. దీంతో ఇద్దరు నేతలు మంత్రి సమక్షంలోనే ఒక్కటయ్యారు.

రంగంలోకి కేటీఆర్​..
బీఆర్ఎస్​ అధినేత కేసీఆర్​ ఒకేసారి 115 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే అక్కడక్కడ కొన్ని సెగ్మెంట్లలో విబేధాలు నెలకొన్నాయి. దీంతో మంత్రి కేటీఆర్​ రంగంలోకి దిగారు. వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న సమస్యలను తనదైన శైలిలో పరిష్కరిస్తున్నారు. తాజాగా స్టేషన్​ ఘన్​పూర్​లో నెలకొన్న సమస్యలను మంత్రి పరిష్కరించారు. తాటికొండ రాజయ్య, కడియం శ్రీహరి మధ్య సయోధ్యను కుదిర్చారు. ఎమ్మెల్యే తాటి కొండ రాజయ్యపై అనేక ఆరోపణలు రావడంతో ఆయనను సీఎం కేసీఆర్​ పక్కకు పెట్టారు. ఈ దఫా కడియం శ్రీహరి కి టిక్కెట్ కేటాయించారు. దీంతో నియోజకవర్గంలో బీఆర్ఎస్​ రెండు గ్రూపులుగా విడిపోయింది. ఒక దశలో అటు కడియం శ్రీహరి, ఇటు రాజయ్య ఒకరిపై ఒకరు ఘాటుగా విమర్శలు ఆరోపణలు చేసుకున్నారు. దీంతో స్టేషన్ గులాబీ రాజకీయాలు చిందరవందరగా మారాయి.‌ ఈ ఇద్దరు నాయకుల వ్యవహారం ప్రజల్లోనూ గులాబీ పార్టీ ప్రతిష్టను దిగజార్చే వైపు నెట్టబడ్డాయి.‌ ఈ నేపథ్యంలో పరిస్థితిని గమనించిన అధిష్ఠానం ఇద్దరు నాయకుల మధ్య సఖ్యత కుదిరించేందుకు ప్రయత్నిస్తూనే ఉంది. ఎట్టకేలకు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి చొరవతో కడియం, తాటికొండ ఒక్కటయ్యారు. మంతి కేటిఆర్ సమక్షంలో ఇద్దరు నేతలు కలిసిపోయారు.

Recent

- Advertisment -spot_img