– మంత్రి పువ్వాడ అజయ్
ఇదేనిజం, తెలంగాణ బ్యూరో : పదవుల కోసం మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దిగజారుతున్నారని మంత్రి పువ్వాడ అజయ్ అన్నారు. కేసీఆర్ గురించి తుమ్ముల ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సరికాదన్నారు. 2014లో మంత్రి పదవి ఇవ్వకపోయింటే తుమ్ముల ఇంటికే పరిమితమయ్యేవారన్నారు. శనివారం ఆయన ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్రతో కలిసి విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్, తుమ్మల ఒకేసారి రాజకీయాల్లోకి వచ్చారని, కేసీఆర్ వల్లే తుమ్మలకు మంత్రి పదవి వచ్చిందన్నారు.