– సోదాలు చేస్తున్న 15 మంది అధికారులు
ఇదేనిజం, హైదరాబాద్: మహేశ్వరం బీఆర్ఎస్ అభ్యర్థి కేఎల్ఆర్ నివాసంలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. దాదాపు 15 మంది అధికారులు ఈ రెయిడ్స్ లో పాల్గొంటున్నారు. గురువారం కూడా ఐటీ రెయిడ్స్ జరిగిన విషయం తెలిసిందే. తాజాగా శుక్రవారం సైతం సోదాలు జరుగుతున్నాయి. నిన్న రాత్రి 1గంట వరకూ ఐటీ బృందం సోదాలు జరిపించింది. ఇంట్లో లభ్యం అయిన డాక్యుమెంట్స్ని అధికారులు తీసుకెళ్లారు. మాదాపూర్లోని కేఎల్ఆర్ హెడ్ క్వార్టర్స్ ఆఫీసులో సోదాలు కొనసాగుతున్నాయి. నిన్న రాత్రి ఫామ్ హౌజ్ సోదాలు ముగిసిన తర్వాత.. అక్కడ స్టేట్మెంట్ను అధికారులు నార్సింగ్ ఇంటికి తీసుకొచ్చారు. మరోసారి 5 వాహనాలలో లక్ష్మారెడ్డి ఇంటికి ఐటీ అధికారులు చేరుకున్నారు.
జానా నివాసంలోనూ సోదాలు
ఇక మాజీ మంత్రి జానారెడ్డి నివాసంలోనూ సోదాలు జరుగుతున్నాయి. హైదరాబాద్లోని విస్పర్ వ్యాలీ విల్లాస్ లో తనిఖీలు జరుగుతుండగా, ఆయన కుమారుడు రఘువీర్ రెడ్డి వ్యాపార లావాదేవీలపై ఆరా తీస్తున్నారు. మొత్తం 18 చోట్ల కాంగ్రెస్ నేతల ఇళ్లల్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి.