– ఏపీ సీఎంపై వైసీపీ ఎంపీ రఘురామ సెటైర్
ఇదే నిజం, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్లోని పాలకొల్లులో టిడ్కో ఇళ్లు ప్రజలకు ఇచ్చినట్టే ఇచ్చి వాటిపై వైసీపీ ప్రభుత్వం లోన్ తీసుకుందని ఆ పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు ఆరోపించారు. ఈ విషయాన్ని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు బయట పెట్టారని చెప్పారు. ఇదో పెద్ద స్కాం అని రఘురామ అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భవిష్యత్లో ఏపీలో ఉన్న అందరి ఆస్తులను బ్యాంకుల్లో సీఎం జగన్ తాకట్టు పెట్టే అవకాశం ఉందన్నారు. ‘రాష్ట్రంలో ఆర్థిక కుంభకోణాలపై కోర్టులో పిటిషన్ దాఖలు చేశాను. వేరే ధర్మాసనం ముందు త్వరలో పిటిషన్ విచారణకు రానుంది. వలంటీర్లను అడ్డుపెట్టుకొని అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. జగన్ అక్రమాస్తులపై త్వరగా విచారణ జరపాలని మాజీ ఎంపీ హరిరామ జోగయ్య పిటిషన్ వేయడం.. జగన్కి తెలంగాణ హైకోర్టు నోటీసులు ఇవ్వడం శుభ పరిణామం. సీఐడీ చీఫ్ సంజయ్, ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి దేశమంతా తిరిగి ప్రెస్మీట్లు పెట్టొచ్చా? తెదేపా అధినేత చంద్రబాబు మాత్రం కేసుపై మాట్లాడొద్దు అంటారా? ఢిల్లీలోని ఒక హోటల్లో సీఐడీ అధికారి సంజయ్, ఏఏజీ సుధాకర్ రెడ్డి పెట్టిన ప్రెస్మీట్కి ఎవరు డబ్బులు కట్టారు? బిల్లులు ఎలా చెల్లించారు?’అని రఘురామ ప్రశ్నించారు.