Homeహైదరాబాద్latest Newsఅందరూ చూస్తుండగానే యువతి కిడ్నాప్​

అందరూ చూస్తుండగానే యువతి కిడ్నాప్​

– సోషల్ మీడియాలో వీడియో వైరల్​

ఇదేనిజం, నేషనల్​ బ్యూరో: అందరూ చూస్తుండగానే ఓ యువతి కిడ్నాప్​ కు గురైంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది. ఈ ఘటన మధ్యప్రదేశ్​లోని గ్వాలియర్​లో చోటు చేసుకున్నది. 19 ఏళ్ల యువతిని అందరూ చూస్తుండగానే ఇద్దరు దుండగులు కిడ్నాప్‌ చేశారు. బస్సు దిగి, తన సోదరుడి కోసం పెట్రోల్‌ బంకు వద్ద వేచి చూస్తున్న ఆమెను.. బలవంతంగా బైక్‌పై ఎక్కించుకొని దుండగులు పరారయ్యారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో సోమవారం జరిగింది. ఈ దృశ్యాలు అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి.

Recent

- Advertisment -spot_img