HomeతెలంగాణCongress​ ఫేక్​ హామీలు నమ్మొద్దు

Congress​ ఫేక్​ హామీలు నమ్మొద్దు

– కౌలు రైతులకు భరోసా సాధ్యం కాదు
– బీజేపీ పాలనను కోరుకుంటున్న జనం
– ఎంపీ లక్ష్మణ్​ కీలక వ్యాఖ్యలు

ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్​ ఫేక్ హామీలు నమ్మొద్దని ఎంపీ లక్ష్మణ్​ పేర్కొన్నారు. కౌలు రైతులకు రైతు భరోసా సాధ్యం కాదని చెప్పారు. అసలు కాంగ్రెస్ పార్టీ కౌలు రైతులను ఎలా గుర్తిస్తుందని ప్రశ్నించారు. దీనికంటూ ఓ విధానం ఉందా? కోరారు. కాంగ్రెస్‌ పార్టీ పెయిడ్‌ సర్వేలతో ప్రజలను మోసం చేస్తోందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌ అన్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌ బూటకపు హామీలతో మోసం చేస్తోందని విమర్శించారు. కౌలు రైతులకు రైతు భరోసా అనేది సాధ్యం కాదని చెప్పారు. సాధ్యం కాదని తెలిసీ రైతుభరోసా ఇస్తామని చెప్పి ప్రజలను కాంగ్రెస్‌ మోసం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘రాష్ట్ర ప్రజలు భాజపా పాలనను కోరుకుంటున్నారు. తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్‌ పార్టీకి ఎప్పుడూ 60 సీట్లు రాలేదు. గతంలోనూ ఉమ్మడి రాష్ట్రంలో కోస్తాంధ్ర, రాయలసీమ సీట్లతోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది’ అని లక్ష్మణ్‌ అన్నారు.

Recent

- Advertisment -spot_img