Homeతెలంగాణలోపాలను సమీక్షించుకుంటాం

లోపాలను సమీక్షించుకుంటాం

– ప్రజా తీర్పును గౌరవిస్తున్నాం
– బీఆర్ఎస్​ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు

ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: ఎన్నికల్లో ఓటమిపై లోపాలను సమీక్షించుకుంటామని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు అన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రజా తీర్పును గౌరవిస్తున్నామని చెప్పారు. ప్రపంచం మెచ్చేలా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను తెలంగాణలో అమలు చేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదేన్నారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఎందుకు గెలిపించారో అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందన్నారు. కొత్తగా కొలువు తీరబోతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి అభినందనలు తెలియజేశారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలు దిశగా కొత్త ప్రభుత్వం పని చేయాలని కోరుకుంటున్నట్లు కేకే వెల్లడించారు

Recent

- Advertisment -spot_img