– కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉత్తమ్ కుమార్ రెడ్డి
ఇదే నిజం, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర సీఎం అభ్యర్థిగా ఎవరి పేరును కాంగ్రెస్ అధిష్ఠానం ప్రకటించినా తనకు ఆమోదమేనని ఆ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే ఉత్తమ్ కుమార్రెడ్డి తెలిపారు. మంగళవారం ఢిల్లీ వెళ్లిన ఆయన.. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్తో భేటీ అయ్యారు. సీఎం అభ్యర్థి ఎంపిక సహా మంత్రివర్గ కూర్పుపై ఇంకా స్పష్టత రాని నేపథ్యంలో డీకేతో ఉత్తమ్ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. డీకే శివకుమార్తో సమావేశం అనంతరం ఉత్తమ్ మీడియాతో మాట్లాడారు. సీఎం అభ్యర్థిని ఏఐసీసీ అధ్యక్షుడు ఖరారు చేస్తారని చెప్పారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో హుజూర్నగర్ ఎమ్మెల్యేగానూ గెలుపొందిన నేపథ్యంలో ఎంపీ పదవికి తాను రాజీనామా చేస్తానన్నారు. అది ఎప్పుడనేది త్వరలో నిర్ణయించి వెల్లడిస్తానని చెప్పారు.