HomeసినిమాSandeep Vanga : చాన్స్ వస్తే చిరంజీవితో యాక్షన్​ డ్రామా తీస్తా

Sandeep Vanga : చాన్స్ వస్తే చిరంజీవితో యాక్షన్​ డ్రామా తీస్తా

‘అర్జున్‌రెడ్డి’, ‘యానిమల్‌’లాంటి చిత్రాలతో బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాలను అందుకున్నారు దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా. తాజాగా రిలీజైన యానిమల్ మూవీ సక్సెస్ నేపథ్యంలో సందీప్‌ యూఎస్‌ పర్యటనకు వెళ్లారు. అక్కడి సినీ లవర్స్​తో కాసేపు సరదాగా మాట్లాడారు. ఇందులో భాగంగా తనకు చిరంజీవితో కలిసి వర్క్‌ చేయాలని ఉందని చెప్పారు. అవకాశం వస్తే తప్పకుండా చిరంజీవితో ఓ యాక్షన్‌ డ్రామా తెరకెక్కిస్తానన్నారు. అనంతరం ఆయన యూఎస్‌ ఆడియన్స్‌ను ఉద్దేశిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఇప్పటి వరకూ జరిగిన చర్చా కార్యక్రమంలో నాకు నచ్చిన విషయం ఏమిటంటే.. సినిమాకు సంబంధించి ఎన్నో విషయాల గురించి నన్ను అడిగారు. నా ఇష్టాయిష్టాలను అడిగి తెలుసుకున్నారు. కానీ, స్త్రీ ద్వేషంపై ఒక్కరు కూడా నన్ను ప్రశ్నించలేదు. ఎందుకంటే, ఇక్కడ ఉన్న వాళ్లందరూ సినిమాని సినిమాలాగే చూశారు. అందుకు నేను సంతోషంగా ఉన్నా’అని చెప్పారు. ‘కబీర్‌ సింగ్‌’తర్వాత సందీప్‌ రెడ్డి వంగా బాలీవుడ్‌లో తెరకెక్కించిన సినిమా యానిమల్. రణ్‌బీర్‌ కపూర్‌, రష్మిక జంటగా నటించారు. అనిల్‌కపూర్‌, బాబీ డియోల్​ కీలక పాత్రలు పోషించారు. డిసెంబర్‌ 1న విడుదలైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లతో దూసుకెళ్తోంది. ఇక, ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘యానిమల్‌ పార్క్‌’ను తీసుకురానున్నట్లు మూవీ టీమ్ ఇప్పటికే ప్రకటించింది.

Recent

- Advertisment -spot_img