– ప్రకటించిన బీజేపీ అధిష్టానం
ఇదే నిజం, చత్తీస్ గఢ్: చత్తీస్గఢ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా విష్ణుదేవ్ సాయ్ను బీజేపీ ఎంపిక చేసింది. ఆదివారం సమావేశమైన బీజేపీ ఎమ్మెల్యేలు.. శాసనసభా పక్ష నేతగా సాయ్ను ఎన్నుకున్నారు. విష్ణుదేవ్ గతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేశారు. ప్రధాని మోడీ తొలి కేబినెట్లో కేంద్ర మంత్రిగా సేవలందించారు.