– మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
ఇదే నిజం, నేషనల్ బ్యూరో: ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని.. దానికోసం తన వంతు కృషి చేస్తానని తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు. రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యేక హోదాపై ప్రధాని హోదాలో మన్మోహన్సింగ్ హామీ ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఢిల్లీలో కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘ఆంధ్రప్రదేశ్ను ఆదుకోవాలని పార్లమెంట్లో ప్రత్యేక హోదా హామీ ఇచ్చారు. విభజన వేళ ఇచ్చిన హామీని అమలు చేయకపోవడం బాధాకరం. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నా’అని ఆయన అన్నారు.