Homeజిల్లా వార్తలుశిలాఫలకం ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి

శిలాఫలకం ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి

– సీపీకి వినతి పత్రం అందజేత

ఇదేనిజం, వరంగల్‌ : వరంగల్‌ వెస్ట్‌ నియోజకవర్గం క్యాంపు ఆఫీస్‌ శిలాఫలకం ధ్వంసం చేసిన ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌ రెడ్డి అనుచరులపై చర్యలు తీసుకోవాలని మాజీ ప్రభుత్వ చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌ భాస్కర్‌ కోరారు. ఈ మేరకు సీపీ కార్యాలయంలో కమిషనర్‌ అంబర్‌ కిశోర్‌ రaాను కలిసి ఫిర్యాదు చేశారు. ఇటీవల హనుమకొండ బాలసముద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్‌ శిలాఫలకం ఎమ్మెల్యే రాజేందర్‌ రెడ్డి అనుచరులు ధ్వంసం చేశారని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. సీపీని కలిసిన వారిలో వినయ భాస్కర్‌, మేయర్‌ గుండు సుధారాణి, కుడా చైర్మన్‌ సుందర్‌ రాజ్‌, కార్పొరేటర్లు ఉన్నారు.

Recent

- Advertisment -spot_img