– బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్
ఇదేనిజం, లక్షెట్టిపేట :కేంద్రంలో మళ్లీ మోదీయే ప్రధాని అవుతారని, లోక్సభ ఎన్నికలకు బీజేపీ శ్రేణులు సిద్ధం కావాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు వేరబెల్లి రఘునాథ్ పిలుపునిచ్చారు. మంగళవారం పట్టణంలోని విశ్రాంతి భవనంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా బీజేపీ రైతాంగ సమస్యలపై ఎన్నో పోరాటాలు చేసిన తమను రెండో స్థానంలో నిలిపిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం పోరాడమన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు. అయోధ్యలో రామమందిరం నిర్మిస్తున్నమన్నారు. ప్రజలకు ఎలాంటి ఆపద వచ్చిన ఆదుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. సమావేశంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు హరిగోపాల్, నాయకులు జగన్మోహన్ రెడ్డి, వేముల మధు, బొప్పు కిషన్ పాల్గొన్నారు.