Homeహైదరాబాద్latest Newsఈ కుక్క ఖరీదు రూ. 20 కోట్లుచూసేందుకు ఎగబడ్డ జనం

ఈ కుక్క ఖరీదు రూ. 20 కోట్లుచూసేందుకు ఎగబడ్డ జనం

ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: కుక్కలను పెంచుకోవడం చాలామందికి హాబీ. కొంతమంది వాటితో ప్రత్యేక అనుబంధం ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. అయితే తాజాగా హైదరాబాద్​ లో రూ. 20 కోట్లు ఖరీదు చేసే ఓ కుక్క ప్రత్యక్షమైంది. దీన్ని చూసేందుకు జనం ఎగబడ్డారు. కాకాసియన్‌ షెపెర్డ్‌ జాతి కుక్క తాజాగా మియాపూర్​ లో కనిపించింది. శనివారం మియాపూర్‌లోని విశ్వ పెట్‌ క్లినిక్‌కు ఆరోగ్య పరీక్షల కోసం శునకాన్ని తీసుకువచ్చారు. బెంగళూరుకు చెందిన ఇండియన్‌ డాగ్‌ బ్రీడర్‌ అసోసియేషన్ అధ్యక్షుడు, నటుడు సతీశ్‌ ఇటీవల కాకాసియన్‌ షెపెర్డ్‌ జాతికి చెందిన శునకాన్ని రూ.20కోట్లకు కొనుగోలు చేశారు. ఆ శునకానికి కాడాబామ్‌ హైడర్‌ అనే పేరు కూడా పెట్టారు. శనివారం హైదరాబాద్‌లో జరిగే డాగ్‌ షో కోసం శునకాన్ని హైదరాబాద్‌ తీసుకొచ్చారు. మియాపూర్‌కు వస్తుందని తెలియడంతో దాన్ని చూసేందుకు స్థానికులంతా ఎగబడ్డారు.

Recent

- Advertisment -spot_img