Homeఅంతర్జాతీయంగుండెపోటుతో సర్పంచ్ మృతి

గుండెపోటుతో సర్పంచ్ మృతి

ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: సర్పంచ్ మృతిచెందిన సంఘటన నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. మక్తల్ మండలంలోని సంగంబండ సర్పంచ్ రాజు ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొని తిరిగి ఇంటికి వస్తున్నాడు. ఈ క్రమంలో మార్గమధ్యంలో గుండెనొప్పితో అస్వస్థతకు గురయ్యాడు. గమనించిన గ్రామస్థులు వెంటనే మండలంలోని ఓ ఆసుపత్రికి తరలించారు. అనంతరం జిల్లా ఆస్పత్రికి తరలిస్తుండగా అప్పటికే సర్పంచ్ మరిణించినట్లు వైద్యులు తెలిపారు.

Recent

- Advertisment -spot_img