ఇదేనిజం, ఉప్పల్ : మున్నూరు కాపు పిల్లలు సంబంధాలు కుదుర్చుకునేందుకు కాచిగూడ మున్నూరుకాపు ట్రస్ట్ భవన్ మ్యేడం అంజయ్య హాల్లో ఈ నెల 21న వివాహ పరిచయ వేదిక నిర్వహిస్తున్నట్లు అధ్యక్షుడు మణికొండ వెంకటేశ్వరరావు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని మున్నూరుకాపు మహాసభ ఆధ్వర్యంలో ఈ కార్యకమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. మున్నురు కాపుల కోసం గత 40 సంవత్సరాలుగా మ్యారేజ్ బ్యూరో కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. మున్నూరు కాపులతో పాటు ఎన్ఆర్ఐ కుల సోదరులు కూడా వివాహ పరిచయంలో పాల్గొని తమ పిల్లలకు సంబంధాలు కుదుర్చుకుంటారని తెలిపారు. మున్నుకాపులు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.