– ఎమ్మార్పీఎస్ టీఎస్ జిల్లా అధ్యక్షుడు పాలడుగు పరుశురాం మాదిగ
ఇదేనిజం, లక్షెట్టిపేట: హైదరాబాదులోని ఇందిరా పార్క్ లో ఫిబ్రవరి 29న జరిగే చలో హైదరాబాద్ ఫోరు గర్జన సభను విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ టీఎస్ జిల్లా అధ్యక్షుడు తగరం మధురాజ్, మంచిర్యాల నియోజకవర్గం ఇంచార్జ్ లింగంపల్లి సుధాకర్ పిలుపునిచ్చారు. గురువారం లక్షెట్టిపేట ఐబీ ఆవరణంలో చలో హైదరాబాద్ పోరు గర్జన కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం చెప్పులు కుట్టే వృత్తిదారులకు నెలకు 5,000 రూపాయలు పింఛన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణపై స్పష్టమైన వైఖరి అవలంబించి మాదిగలకు సముచిత న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి నియోజకవర్గ ఇంచార్జ్ ఇప్ప రాజన్న, చెన్నూరు నియోజకవర్గ ఇంచార్జ్ ప్రశాంత్, రాష్ట్ర నాయకులు భూమన్న, శ్రావణ్, సతీశ్, లక్ష్మణ్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.