Homeజిల్లా వార్తలుపందెం కోడికి వేలం..

పందెం కోడికి వేలం..

ఇదేనిజం, కరీంనగర్​ బ్యూరో: పందెంకోడికి వేలం వేయడానికి కరీంనగర్ టు డిపో అధికారులు సిద్ధమయ్యారు. ఈనెల తొమ్మిదో తేదీన గుర్తు తెలియని ప్రయాణికుడు పందెంకోడిని బస్సులో మర్చిపోయాడు. దానిని తీసుకోవడానికి గత మూడు రోజులుగా ఎవరూ రాలేదు. దీంతో అధికారులు పందెంకోడిని వేలం వేయడానికి తేదీ ఖరారు చేశారు. శుక్రవారం రోజున మధ్యాహ్నం 3 గంటలకు డిపో కార్యాలయంలో బహిరంగ వేలం వేసేందుకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఆసక్తి గలవారు ఈ వేలంలో పాల్గొన్న వచ్చు అని అధికారులు సూచించారు.

Recent

- Advertisment -spot_img