Homeహైదరాబాద్latest Newsహైదరాబాద్​ వాసులకు గుడ్​ న్యూస్​

హైదరాబాద్​ వాసులకు గుడ్​ న్యూస్​

– సికింద్రాబాద్ కంటోన్మెంట్​ లో సైనిక్​ స్కూల్​

ఇదేనిజం, హైదరాబాద్​: హైదరాబాద్ వాసులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్​ న్యూస్​ చెప్పబోతున్నట్టు సమాచారం. త్వరలో కంటోన్మెంట్​ లో సైనిక్​ స్కూల్​ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. కంటోన్మెంట్​ లో పాఠశాలలను నెలకొల్పేందుకు సీఎం రేవంత్​ రెడ్డి ఆసక్తి చూపుతున్నారు. ఇటీవల ఢిల్లీలో పర్యటించిన సందర్భంగా కేంద్ర రక్షణశాఖ మంత్రిని కలిసి వినతి పత్రం ఇచ్చారు. సైనిక్​ స్కూల్​ ను మంజూరు చేయడంతోపాటూ పాఠశాలలకు అవసరమైన 50 ఎకరాల స్థలాన్ని కూడా కేటాయించాలని.. అందుకు వేరే చోట స్థలం ఇస్తామని సీఎం ప్రతిపాదించారని తెలుస్తోంది. సైనిక్​ స్కూల్​ కోసం రూ. 100 కోట్లు అవసరం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారని సమాచారం.

Recent

- Advertisment -spot_img