– సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు అతిమేల మాణిక్
ఇదేనిజం, నారాయణఖేడ్: రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సీసీఐ కొనుగోలు కేంద్రాలను తెరవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు అతిమేల మాణిక్ డిమాండ్ చేశారు. సోమవారం నారాయణఖేడ్ లోని సీపీఎం కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నారాయణఖేడ్ సెగ్మెంట్ లో పెద్ద ఎత్తున పత్తి పంట సాగు అవుతోందని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా 3,55,802 ఎకరాల్లో సుమారు 3,55,802 మెట్రిక్ టన్నుల పత్తి ఉత్పత్తి అవుతోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు నరసింహులు, కాన్సిరాం, సంతోష్, మోషప్ప, అరుణ్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.