ఇదేనిజం, మల్కాజిగిరి: మల్కాజిగిరి పరిధిలోని నేరేడ్మెట్లోని వినాయక్ నగర్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. వినాయక్ నగర్ వద్ద ఈ యాక్సిడెంట్ జరిగింది. ఆటోను బైక్ ఢీకొట్టడంతో బైక్పై వెళ్తున్న వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. సమాచారమందుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం గాంధీకి తరలించినట్లు తెలుస్తోంది.