Homeహైదరాబాద్latest Newsఘనంగా శ్రీ లక్ష్మి వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు

ఘనంగా శ్రీ లక్ష్మి వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు

ఇదే నిజం, కుత్బుల్లాపూర్: శ్రీ లక్ష్మి వేంకటేశ్వర స్వామి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిది జగద్గిరిగుట్ట శ్రీ లక్ష్మి వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవ కళ్యాణోత్సవానికి మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై, స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ వేంకటేశ్వర స్వామి కరుణాకటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని, ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఓబిసి రాష్ట్ర కార్యవర్గసభ్యులు జేకె శేఖర్ యాదవ్, డివిజన్ బీజేపీ అధ్యక్షులు పున్నా రెడ్డి, బీజేపీ నాయకులు మేకల సురేష్ రెడ్డి, మోతె శ్రీనివాస్ యాదవ్, సిద్దిరాం రెడ్డి, ఓరుగంటి నరేష్, వసుందర, గండి రాజు యాదవ్, మాధవులు అరుణ్ కుమార్, ముప్పిడి రవి, జగ్గు, రేవంత్, ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img