Homeహైదరాబాద్latest Newsపోలియో మహమ్మారిని తరిమేద్దాం

పోలియో మహమ్మారిని తరిమేద్దాం

– ఎమ్మెల్యే కేపీ వివేకానంద

ఇదేనిజం, కుత్బుల్లాపూర్ : పిల్లలకు పల్స్ పొలియో చుక్కలు వేయించి పోలియో మహమ్మారిని తరిమేయాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద అన్నారు. అనంతరం 131 కుత్బుల్లాపూర్ డివిజన్ బాపునగర్‌లో ఎమ్మెల్యే కేపీ. వివేకానంద మాజీ కార్పొరేటర్ కేఎం గౌరీష్‌తో కలిసి పోలియో చుక్కల కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఐదు సంవత్సరాలలోపు పిల్లలకు తల్లిదండ్రులు విధిగా పోలియో చుక్కలు వేయించాలన్నారు. నిండైన జీవితానికి రెండు చుక్కలు విధిగా వేయించడం మన బాధ్యత అన్నారు. కార్యక్రమంలో 131 డివిజన్ ప్రధాన కార్యదర్శి సత్తిరెడ్డి, కిషోర్‌చారి, బాపునగర్ వెల్ఫేర్ అసోసియేషన్ దూదిమెట్ల కృష్ణ యాదవ్, ప్రధాన కార్యదర్శి బాబు, దేవాలయ కమిటీ సభ్యులు సుబ్బారావు, కాలనీవాసులు శ్రీనివాస్, శ్రీధర్, రాజు, మల్యాద్రి, గాంధీ రెడ్డి, బాల్ రెడ్డి నగర్ ప్రెసిడెంట్ దుర్గారెడ్డి, దేవేందర్, పల్స్ పోలియో వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img