ఇదేనిజం, కుత్బుల్లాపూర్ : ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజుని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాలకు చెందిన నాయకులు ఆదివారం శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. తమ కాలనీలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరగా, ఎమ్మెల్సీ అందుకు సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, సంక్షేమ సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.