BREAKING : సీఎం నివాసంలో CONGRESS స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరుగుతోంది. మిగతా నాలుగు ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించేందుకు కసరత్తు. వరంగల్ ఎంపీ అభ్యర్థిగా కడియం శ్రీహరి పేరు దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది. ఖమ్మం, హైదరాబాద్, కరీంనగర్ అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. AICC కార్యదర్శులు రోహిత్ చౌదరి, విష్ణునాథ్ స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ హరీశ్ చౌదరి, దీపాదాస్ మున్షీ పాల్గొన్నారు.