ఐపీఎల్ 2024 సందర్బముగా క్రికెట్ ప్రియులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఉన్న ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా మహిళలు, పిల్లలు ఈ టీమ్ను ఆరాధిస్తారు.
తాజాగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ కోల్కతా నైట్రైడర్స్ మ్యాచ్లో ఓ చిన్నారి ఫ్యాన్ ఇంట్రెస్టింగ్ ప్లకార్డుతో కనిపించింది. ‘ఆర్సీబీ కప్ గెలిచే వరకు నేను పాఠశాలకు వెళ్లను’ అని ప్లకార్డుపై రాసి ఉంది. దీనిపై కొందరు సెటైర్లు వేస్తున్నారు. స్కూలుకు వెళ్లొద్దని గట్టి ప్లాన్ వేసిందంటూ కామెంట్స్ చేస్తున్నారు.