ఐపీఎల్-2024 షెడ్యూల్లో రెండు మ్యాచ్ల తేదీలు మారాయని బీసీసీఐ తాజాగా వెల్లడించింది. ఈ నెల 17న శ్రీరామ నవమి ఉండటంతో ఈ నిర్ణయాన్ని తీసుకుంది. దీంతో ఏప్రిల్ 16న జరగాల్సిన గుజరాత్ వెర్సెస్ ఢిల్లీ (GT vs DC) మ్యాచ్ను 17వ తేదీకి, అలాగే ఏప్రిల్ 17న నిర్వహించాల్సిన కోల్కతా వెర్సెస్ రాజస్థాన్ (KKR vs RR) మ్యాచ్ను 16వ తేదీకి మార్చారు. తేదీల్లో మాత్రమే మార్పులు చోటు చేసుకున్నాయని, వేదికలో ఎలాంటి మార్పు లేదని బీసీసీఐ స్పష్టం చేసింది.