హైదరాబాద్ లో దారుణ ఘటన చోటుచేసుకుంది. అన్నం వండలేదని ఓ వ్యక్తిని రూమ్మేట్స్ కొట్టి చంపారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్థాన్ వాసి హన్స్ రామ్(38) కుత్బుల్లాపూర్ లో ఉంటున్నాడు. భార్య 2 నెలల క్రితం ఊరెళ్లింది. దాంతో జీడిమెట్లలోని బినయ్ సింగ్ గదిలో ఉంటున్నాడు. అదే గదిలో ఉండే సందీప్, సోను మంగళవారం రాత్రి మద్యం తాగొచ్చారు. అన్నం వండలేదన్న కారణంతో రామ్ ను కొట్టి చంపారు. నిందితులు పరారీలో ఉన్నారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.