Hyderabad : భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి, పొంగులేటి సమక్షంలో అనుచరులతో సహా పార్టీ కండువా కప్పుకున్నారు. నిన్న జరిగిన కాంగ్రెస్ సభలో వెంకట్రావు హాజరయ్యారు. వెంకట్రావును కాంగ్రెస్ లో చేర్చుకోవడంపై మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.