ఇదేనిజం, లక్షెట్టిపేట: రంజాన్ పర్వ దినాన్ని పురస్కరించుకొని వచ్చే భక్తులకు ఇబ్బందుల్లేకుండా చూడాలని మున్సిపల్ కమీషనర్ కల్లెడ రాజశేఖర్ సిబ్బందికి సూచించారు. బుధవారం పట్టణంలోని క్లబ్ రోడ్డులో గల ఈద్గాను సందర్శించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ..ఈద్గా పరిసర ప్రాంతాలను శుభ్రం చేయాలని సిబ్బందికి సూచించారు. అయన వెంట కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు ఆరిఫ్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.