Homeహైదరాబాద్latest NewsBREAKING: జగన్‌ పై రాయితో దాడి చేసిన వ్యక్తి దొరికాడు.. ఎవరంటే?

BREAKING: జగన్‌ పై రాయితో దాడి చేసిన వ్యక్తి దొరికాడు.. ఎవరంటే?

సీఎం జగన్‌ పై రాయితో దాడి చేసింది సతీష్ కుమార్ అనే యువకుడుగా పోలీసులు గుర్తించారు. ఇందులో భాగంగానే ఈ రోజు ఉదయం సతీష్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. దాడి చేసిన సమయంలో సతీష్ తో పాటు ఉన్న ఆకాష్, దుర్గా రావు, చిన్నా, సంతోష్ లను కూడా అదుపులోకి తీసుకుంది సిట్. ఫుట్ పాత్ కు వేసే ఎర్రటి టైల్స్ రాయి ముక్కతో దాడి చేసినట్టు పోలీసులు గుర్తించినట్టు సమాచారం అందుతోంది. రాయి ముక్కను జేబులో వేసుకుని వచ్చి సడెన్ గా జగన్ పై సత్తి దాడి చేసినట్టు విచారణలో పోలీసులు గుర్తించినట్టు సమాచారం అందుతోంది.

Recent

- Advertisment -spot_img