Homeహైదరాబాద్latest Newsఘనంగా సీతారాముల కళ్యాణోత్సవం

ఘనంగా సీతారాముల కళ్యాణోత్సవం

ఇదేనిజం, మెట్ పల్లి : మెట్ పల్లి పట్టణంలోని శ్రీ కోదండ రామాలయంలో సీతారాముల కళ్యాణోత్సవం ఘనంగా సాగింది. మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు దంపతులు, ఆలయ చైర్మన్ మహాజన్ నర్సింహులు దంపతులు కళ్యాణోత్సవం లో పాల్గొన్నారు. అర్చక స్వాముల మంత్రోచ్ఛారణల మద్య నిర్వహించిన కళ్యాణోత్సవంలో కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్, మున్సిపల్ చైర్మన్ సుజాత సత్యనారాయణ, ఎస్సారెస్పీ ఈ ఈ వెంకటేశ్వర్లు, శ్రీనివాసచారి, పోశయ్య, శివకుమార్, కౌన్సిలర్లు వివిధ పార్టీల నాయకులు, భక్తులు  పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img