Homeహైదరాబాద్latest Newsఅవమానం నుంచి ఐఏఎస్

అవమానం నుంచి ఐఏఎస్

AP : ప్రభుత్వ పాఠశాల, కాలేజీల్లో ఇంటర్, డిగ్రీ పూర్తి చేసిన ఓ సాధారణ వ్యక్తి యూపీఎస్సీ సివిల్స్ సర్వీస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ప్రతిభ కనబరిచాడు. సింగరాయకొండ మండలం ఊళ్లపాలేనికి చెందిన ఉదయ్ కృష్ణారెడ్డి చిన్నతనంలోనే తల్లిదండ్రలను కోల్పోయాడు. నానమ్మ కూరగాయలు అమ్ముకుంటూ చదివించింది. కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న సమయంలో సీఐ అవమానించాడు. తనకి జరిగిన అవమానం కృష్ణారెడ్డిలోని ప్రతిభను, ఫైర్‌ను లేవనెత్తింది. జాబ్ వదిలేసి సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యాడు. తన నాలుగో ప్రయత్నంలో 780 ర్యాంకు సాధించి ఎంతో మంది పేద విద్యార్థులకు ఆదర్శంగా నిలిచాడు. చదువుకోవాలన్న తపన, కష్టపడి పైకి రావాలనే కోరిక బలంగా ఉంటే ఏవీ ఆపలేవనడానికి కృష్ణారెడ్డి చక్కని ఉదాహరణ.

Recent

- Advertisment -spot_img