జూన్లో జరగనున్న టీ20 ప్రపంచకప్కు భారత జట్టును బీసీసీఐ ఇటీవలే ప్రకటించింది. అయితే టీమ్ ఇండియా వరల్డ్ కప్ లో ఇద్దరు స్టార్ ప్లేయర్లకు స్థానం కల్పించకపోవడం హాట్ టాపిక్ గా మారింది. స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్, సీనియర్ పేసర్ మహ్మద్ షమీకి బీసీసీఐ షాక్ ఇచ్చింది. ప్రపంచకప్ లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న మహ్మద్ షమీ.. ప్రస్తుతం ఐపీఎల్ లో నిలకడగా ఆడుతున్న రాహుల్ కు చోటు దక్కకపోవడంతో అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
టీమ్ ఇండియా టీ20 వరల్డ్ కప్ జట్టు : రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, శాంసన్, హార్దిక్ పాండ్య, శివమ్ దూబె, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, చాహల్, అర్ష్దీప్ సింగ్, బుమ్రా, సిరాజ్.
ట్రావెలింగ్ రిజర్వ్ : శుభ్మన్ గిల్, రింకు సింగ్, ఖలీల్ అహ్మద్, అవేశ్ఖాన్